Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుశాంత్ మృతిపై సీబీఐ ప్రకటన
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసుకు సంబంధించి ఇప్పటి వరకూ ఎటువంటి కోణం బయటపడలేదని సీబీఐ పేర్కొంది. ఈ కేసుపై అన్ని కోణాల్లో ఉన్నతస్థాయి విచారణ చేస్తున్నామని, ఈ దర్యాప్తు కొనసాగుతుందని సొమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. సుశాంత్ ఆత్మహత్య కేసును హత్యగా మార్చేందుకు సీబీఐ ఆలస్యం చేస్తోందని సుశాంత్ కుటుంబసభ్యుల తరపు న్యాయవాది వికాస్సింగ్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో సిబిఐ నుంచి తాజా ప్రకటన రావడం గమనార్హం. సిబిఐ విచారణ ఒక్కసారిగా నెమ్మదించిందని, మొత్తం కేసుపై ఉన్న దృష్టిని మాదకద్రవ్యాల కేసు వైపు తిప్పారని అన్నారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు విచారణ పేరుతో బాలీవుడ్ నటులతో ఫ్యాషన్ పెరేడ్ నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు.