Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మమతా బెనర్జీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ నూతన జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన అనుపమ్ హజ్రాపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. తనకు కరోనా వస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళ, పార్టీ అధినేత్రిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలుచేసిన ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తృణమూల్ నేతలు డిమాండ్చేశారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బీజేపీ నేత మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో మమతా బెనర్జీ విఫలమయ్యారని ఆరోపించారు. 'నాకు ఏదో ఒక సమయంలో కరోనా వస్తుంది. నేను అప్పుడు నేరుగా వెళ్లి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుంటాను. అప్పుడు ఆమెకు ప్రజలు పడుతున్న కష్టం, ప్రియమైన వారిని కోల్పోతే కలిగే బాధ తెలుస్తాయి' అని వ్యాఖ్యానించారు.