Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటి సమస్యలపై ఇరువురు సీఎంలతో కేంద్రం చర్చ
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ఇప్పటివరకు రెండు సార్లు వాయిదాపడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం అక్టోబర్ ఆరోవ తేదీన భేటీ కానుంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి రెండు రాష్ట్రాలకు సమాచారం అందించింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ చైర్మన్గా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సభ్యులుగా ఉన్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి జల వివాదాలు, నీటి పంపకాలపై ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తారు. ఇప్పటికే jఔష్ణా నదీ బోర్డు పరిధి, గోదావరి నదీ బోర్టు పరిధి చెప్పాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అలాగే రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాయి. ఎత్తిపోతల పథకాలు నిర్మించిన రెండు రాష్ట్రాలు తమ తమ వాదనలు వినిపిస్తోన్నాయి. కాళేశ్వరం, దేవాదుల, తుపాకుల గూడెం, చరఖా-కొరాట, రామప్ప, ప్రాణహిత తదితర ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తోంది. ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా దిగువన ఉన్న ఏపీ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని పేర్కొంది. అయితే అవి పాతవేనని, అనుమతులు అవసరం లేవని తెలిపింది. కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులను కొత్తవిగా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రాయలసీమ పోతిరెడ్డి పాడు ఎత్తిపోతల విషj ుంలో తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఇప్పటికే కృష్ణా నదీ బోర్డు సమావేశంలో చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు రాష్ట్ర విభజన నుండి కొనసాగుతూ వస్తున్నాయి. అయితే గతంలో నదీ జలాల వివాదంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. వీటిపై ఇటీవలి కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు తమ తమ వాదానలు వినిపించారు. అయినప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. అయితే అపెక్స్ కౌన్సిల్ భేటీలోనైనా నీటి పంచాయితీ పరిష్కారం అవుతుందా? అనే చర్చ జరుగుతుంది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఎటువంటి ప్రాజెక్టులు నిర్మించొద్దని, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తరవాతనే ప్రాజెక్టుల నిర్మాణంపై ముందుకు వెళ్లాలని ఇటీవలి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రెండు రాష్ట్రాలకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగనుంది. ఆగస్టు 5న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ భేటీ అధికారిక సమావేశాలు ఉండటంతో తనకు కుదరదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పడంతో ఆగస్టు 22కి వాయిదా పడింది. అయితే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు కరోనా వైరస్ సోకడంతో మళ్లీ వాయిదా పడింది. మళ్లీ అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించింది.