Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా వ్యాప్తిపై కేరళ ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు
- భారతీయుల్లో నిరోధక శక్తి రాలేదన్న కేంద్ర మంత్రి
- కరోనా వ్యాక్సిన్పై ప్రత్యేక వెబ్ పోర్టల్
- దేశంలో 77 వేల మంది భద్రతా సిబ్బందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే, ఈ విషయాలను పెద్దగా పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను విడతల వారీగా ఎత్తివేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలోనే కేరళ ఆరోగ్య మంత్రి శైలజా.. దేశంలో వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 'లాక్డౌన్తో విసిగిపోయిన ప్రజలు ఇప్పుడిప్పుడే బైటకు వచ్చి తమ రోజువారీ పనులు చేసుకుంటు న్నారు. కానీ కరోనా ఏమాత్రం తగ్గకపోవ టంతో మరోసారి లాక్డౌన్ తప్పదేమో' అని మంత్రి వ్యాఖ్యానించారు. లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేస్తే కరోనా ను అదుపుచేయడం మరింత కష్టం అవు తుందని కేసులు మరింతగా పెరుగు తాయని మంత్రి శైలజ అభిప్రాయ పడ్డారు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 2 వరకూ కేరళ సంప్రదాయ పండుగ ఓనం జరిగింది. ఈ పండుగ తర్వాత కేరళలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. దీంతో రోగుల సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా 20 నుంచి 40 సంవత్సరాల వయసు వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో కేరళలో ఆందోళనకరమైన పరిస్థితు లు నెలకొన్నాయి. దీంతో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తే తప్ప సాధారణ పరిస్థితి రాదని మంత్రి అభిప్రాయపడ్డారు.
దేశంలో 95వేలు దాటిన కోవిడ్-19 మరణాలు
దేశంలో కరోనా ప్రభావం పెరుగుతుండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య 60లక్షలు దాటింది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24గంటల్లో దేశంలో 82,170 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో కొత్తగా 1,039మంది ప్రాణాలు కోల్పో యారు. దేశంలో కరోనాసంఖ్య 60,74,703కు చేరింది. మరణాల సంఖ్య 95,542కు పెరిగింది. ప్రస్తుతం 9,62,640 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 50,16,521 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 82 శాతం, మరణాల రేటు 1.6 శాతానికి చేరంది. పాజిటివిటీ రేటు 8.1 శాతంగా ఉంది. కాగా, దేశంలో ఇప్పటివరకూ మొత్తం 7,19,67,230 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 7,09,394 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది.
77 వేల మంది భద్రతా సిబ్బందికి కరోనా
దేశంలో దాదాపు 77,000 మంది భద్రతా సిబ్బం ది కరోనా బారినపడ్డారు. ఇందులో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎన్ఎస్జీ వంటి పారామిలిటరీ దళాలు సహా పోలీసు సిబ్బంది ఉన్నారు. దేశవ్యాప్తగా మొత్తం 76,768 మంది భద్రతా సిబ్బంది కరోనా సోకిందని బ్యూరో ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నివేదిక వెల్లడించింది. ఆగస్టు 21 నాటి వరకూ నమోదైన వివరాలను పేర్కొంటూ 'ఇండియన్ పోలీస్ రెస్పాన్స్ టూ కోవిడ్-19 క్రైసిస్' అనే పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 401 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో 12,760 పాజిటివ్ కేసు లు, 129 మరణాలతో టాప్లో ఉంది. 40 మరణా లతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మొత్తం పాజిటివ్ కేసుల్లో పారామిలిటరీ దళాలకు చెందిన వారు 15,318 మంది ఉన్నారు. సీఆర్పీఎఫ్కు చెందిన వారు 5,467 మంది ఉన్నారు.
త్వరలోనే ఐసీఎంఆర్ మరో సీరో సర్వే వివరాలు : హర్షవర్ధన్
భారతీయుల్లో కరోనాను నిరోధించగల వ్యాధి నిరోధక శక్తి ఇంకా పెరగలేదనీ, అందుకు చాలా సమయం పట్టవచ్చునని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. అలాగే, ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో జరిగిన రెండో సీరో సర్వే వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్న ఆయన, కరోనా వచ్చి, తగ్గిన వారిలోనూ తిరిగి వైరస్ ఆనవాళ్లు బయట పడుతున్నాయని, దీనిపై ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు పరిశీలనలు జరుపుతున్నారని అన్నారు. ఐసీఎంఆర్ రెండో సీరో సర్వే నివేదిక అతి త్వరలోనే విడుదల కానుందని తెలిపారు. ప్రజల అలవాట్లను మార్చుకో వడం ద్వారానే ఈ వైరస్ను దూరంగా ఉంచగలమ న్న ఆయన, ఇంతవరకూ కరోనా వ్యాధి నిరోధక శక్తి పెరగలేదని అన్నారు. ప్రస్తుతానికి కరోనా రెండోసారి వచ్చిన వారిసంఖ్య నామమాత్రంగానే ఉందనీ, అయినా, ఈవిషయాన్ని తీవ్రంగానే పరిశీలిస్తున్నా మని అన్నారు.
కరోనా వ్యాక్సిన్కు ప్రత్యేక వెబ్ పోర్టల్ !
కరోనా వ్యాక్సిన్ తయారీకి దేశంలో జరుగుతున్న ప్రయత్నాల వివరాలు తెలిపే ప్రత్యేక వెబ్సైట్ను కేంద్రం ప్రారంభించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ సోమవారం నూతన వెబ్సైట్ను ఆవిష్క రించారు. భారత్ వైద్య పరిశోధన మండలి వెబ్సైట్ కు అనుబంధంగా ఈ పోర్టల్ను కేంద్రం లాంచ్ చేసింది. కరోనా టీకా తయారీకి సంబంధించి ప్రస్తు తం దేశంలో జరుగుతున్న ప్రయత్నాలు, క్లీనికల్ ట్రయల్స్కు సంబంధించిన వివరాలు కూడా ఇందు లో అందుబాటులో ఉంటాయి. ఇతర టీకాలకు సం బంధించి పూర్తి వివరాలను కూడా కేంద్రం ఈ పోర్టల్లో ప్రజల కోసం అందుబాటులో ఉంచింది. టీకాకు సంబంధించి ఏవివరాలు తెలుసుకోవాలను కున్న ప్రజలు ఈ పోర్టల్ను సందర్శించాలని మంత్రి హర్షవర్థన్ తెలిపారు. అలాగే, వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కరోనావ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు హర్షవర్దన్ తెలిపారు. కరోనా టీకాతయారీ కోసం దేశంలో విస్తతంగా పరిశోధనలు జరుగుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మూడురకాల టీకాలకు మానవట్రయల్స్ జరుగుతు న్నట్టు ఆయన చెప్పారు. గాలిలోవైరస్ వ్యాపిస్తుందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు హైదరా బాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ (సీసీఎంబీ) కీలక అధ్యయనం ప్రారంభించింది. ఒకవేళ వ్యాపిస్తే.. ఎంతసేపు, ఎంతదూరం దాని ప్రభావం ఉంటుందనే విషయాలను కనుగొనే పరిశోధనను సీసీఎంబీ మొదలుపెట్టింది.