Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగర్తలాలో ఆగని ఆందోళనలు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్సభ స్థానంలో గతకొద్ది రోజులుగా భారీ నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. వ్యవసాయ బిల్లులు, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. నిరసనకారుల నినాదాలతో సోమవారం వారణాసిలోని పలు వీధులు మారుమోగాయి. నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయ బిల్లుల్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల ముందట ఆందోళనలు కొనసాగాయి. నిరసనకారుల్ని చెదరగొట్టడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పోలీస్ బలప్రయోగానికి దిగింది. త్రిపుర రాజధాని అగర్తలాలోనూ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళనలు పెద్ద ఎత్తునసాగాయి. అత్యంత వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లుల్ని పార్లమెంట్ ఆమోదించటాన్ని నిరసిస్తూ రైతు సంఘాలు, ప్రతిపక్షాలు అగర్తలాలో సోమవారం భారీ ర్యాలీ చేపట్టాయి. వేలాదిమంది ఈ ర్యాలీలో ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ మోడీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు త్రిపుర పోలీసులు జలఫిరంగుల్ని ప్రయోగించారు.