Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యోగి ప్రభుత్వంపై మాయావతి, ప్రియాంక గాంధీ ట్వీట్
లక్నో: ఉత్తర ప్రదేశ్లో మహిళలపై లైంగికదాడులు పెరుగుతున్నాయి. తాజాగా హత్రాస్ సామూహిక లైంగిక దాడి సంఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతి ట్విట్టర్ వేదికగా ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆరోపించారు. సెప్టెంబర్ 14న యూపీలోని హత్రాస్ జిల్లాలో 19 ఏండ్ల్ల దళిత మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసిన విషయం విధితమే.. ఆ మహిళ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించింది.