Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: చందమామ పిల్లల పత్రికలో సుదీర్ఘకాలం పాటు చిత్రకారుడిగా పనిచేసిన కరతొలువు చంద్రశేఖరన్ శివశంకరన్ (కె.సి. శివశంకరన్) మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 96 ఏళ్లు. 'శంకర్'గా సుపరిచితుడైన ఆయన చందమామలో విక్రం, భేతాళ కథల్లో చిత్రాలు వేయడం ద్వారా గుర్తింపు పొందారు. చందమామలో మొట్టమొదట పనిచేసిన వడ్డాది పాపయ్య, తోడా వీరరాఘవన్ (చిత్రా)లకు ఆయన సమకాలికుడు. చందమామ పత్రికను మూసివేసేదాకా ఆయన ఆ పత్రికలోనే పనిచేశారు. ఒకే పత్రికలో దాదాపు ఏడు దశాబ్దాలు పనిచేయడం ఒక రికార్డు. శంకర్ 1924 జూలై 19న తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. తల్లి గహిణి. శంకర్కి చిన్నప్పటినుంచీ చిత్రకళ అంటే ఇష్టం. 1946లో తమిళ పత్రిక కలైమగైలో నెలకు రూ.85 వేతనంతో ఆర్టిస్టుగా చేరాడు. 1952లో చందమామలో రూ.350 వేతనంతో చేరారు. శంకర్కు ఐదుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె చెన్నైలో, ఇద్దరు కుమారులు విదేశాల్లో స్థిరపడ్డారు. చందమామ బేతాళ కథల చిత్రకారుడిగా ఐదారు తరాల హృదయాల్లో చోటు సంపాదించుకున్న శంకర్ ... సంపూర్ణ జీవితం అనుభవించారు.