Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూఎన్డిపి (యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) ఎస్డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డును ప్రదానం చేసింది. కరోనా వైరస్ లాక్డౌన్ కాలంలో నిస్వార్ధంగా లక్షలాది వలస కార్మికులు, విద్యార్థులకు సేవలందించినందుకుగానూ ఆయనను ఈ అవార్డుకు ఎంపికచేశారు. సోమవారం సాయంత్రం జరిగిన వర్చువల్ వేడుకలో ఈ అవార్డును అందుకున్నారు. హాలీవుడ్ నటులు ఏంజెలీనా జోలీ, లియోనార్డో డికాప్రియో, ఎమ్మా వాట్సన్, లియామ్ నీసన్, నోబెల్ బహుమతి గ్రహీత ఫుట్ బాల్ లెజెండ్ డేవిడ్ బెక్హామ్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తదితర సినీ ప్రముఖల సరసన సోనూసూద్ చేరారు. మరోవైపు ఇది అరుదైన గౌరవమనీ, యూఎన్ఓ గుర్తింపు తనకు చాలా ప్రత్యేకమైందంటూ సోనూ సూద్ సంతోషం వ్యక్తం చేశారు. 'నా దేశ ప్రజలకు నేను చేయగలిగిన కొద్దిపాటి సహాయాన్ని, నాకు వీలైన విధంగా, ఏ ప్రయోజనం ఆశించకుండా చేశాను. నా చర్యలను గుర్తించి, అవార్డు అందించడం చాలా ఆనందంగా ఉంది. 2030 నాటికి పేదరికం, ఆకలి, లింగ వివక్ష నిర్మూలన లాంటి 17 సమగ్ర అభివద్ధి లక్ష్యాలు (ఎస్డిజి) సాధనలో యుఎన్డిపికి నా పూర్తి సహకారం ఉంటుంది. సంస్థ చర్యల వల్ల మానవాళికి, పర్యావరణానికి అమితమైన వేలు చేకూరుతంది' అని ప్రకటించారు.