Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా వెయ్యికిపైగా కరోనా మరణాలు సంభవిస్తోన్న నేపథ్యంలో.. సోమవారం ఆ సంఖ్య భారీ తగ్గింది. గడిచిన 24 గంటల్లో 776 కరోనా మరణాలు చోటు చేసుకోవడంతో, దేశంలో కరోనా మరణాల సంఖ్య 96,318 కి చేరింది. రెండు నెలల తర్వాత రోజువారీ మరణాలు 800 దిగువన నమోదు కావడం ఇదే మొదటిసారి. సోమవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 70,589 కేసులు నమోదయ్యాయి.
70 వేల కేసులు నమోదు కావడం గత నెల రోజుల్లో ఇదే తొలిసారి. మంగళవారం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 61,45,291 కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటి వరకు 51 లక్షల మంది కోలుకున్నారు. బాధితుల రికవరీ రేటు 83 శాతం దాటగా, మరణాల రేటు 1.57 శాతంగా ఉన్నట్ల్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇప్పటివరకు 7 కోట్ల 31 లక్షల టెస్టులను పూర్తి చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. కరోనా బారిన పడిన మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నేత ఉమాభారతి సోమవారం రిషికేష్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు
పూరీ జగన్నాథ ఆలయంలో 404 మందికి పాజిటివ్
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో సేవకులుగా పనిచేస్తున్న 351 మందికి కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు ఆరోగ్య పరీక్షల్లో తేలింది. వీరితో పాటు మరో 53 మంది సిబ్బంది కూడా వైరస్ బారిన పడినట్టు గుర్తించారు. 12వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో పనిచేస్తున్న మొత్తం 404 మందికి కరోనా సోకినట్టు శ్రీ జగన్నాథ ఆలయ యాజమాన్యం (ఎస్జేటీఏ) నిర్వాహకుడు అజరు జెనా వెల్లడించారు. అయితే ఇంతమంది సేవకులు అందుబోటులో లేకపోయినప్పటికీ జగన్నాథ ఆలయంలో పూజా కార్యక్రమాలు యథాతథంగా జరుగుతాయని ఆయన తెలిపారు.
ఎయిమ్స్లో చేరిన ఉమాభారతి...
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఆ పార్టీ సీనియర్ నేత ఉమాభారతి కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఉత్తరాఖండ్ రుషికేష్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ - ఎయిమ్స్లో చేరారు. 'గత మూడ్రోజులుగా కొద్దిపాటి జ్వరం ఉంది. ఎందుకైనా మంచిదని టెస్ట్ చేయించుకున్నాను. డాక్టర్లు నన్ను క్వారంటైన్లో ఉండమన్నారు. ఆ తర్వాత వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. గత కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్ అయిన వారంతా వెంటనే వెళ్లి టెస్టులు చేయించుకోండి. టెస్టులు పూర్తయ్యే వరకూ ఎవర్నీ కలవకుండా క్వారంటైన్ అవ్వడం మంచిది'' అని ఉమాభారతి తన ట్వీట్లో తెలిపారు.
వాక్సిన్పై సిరమ్ ఇనిస్టిట్యూట్ కీలక ప్రకటన
దేశంలో కరోనా వైరస్ విజంభిస్తున్న తరుణంలో దేశీయ ఔషద సంస్థలన్నీ వ్యాక్సిన్ తయారీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సిరమ్ ఇనిస్టిట్యూట్ కీలక ప్రకటన చేసింది. 2021 ప్రతమార్థంలోనే 10 కోట్ల డోసుల అదనపు కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. తొలి విడతలోనే మధ్యతరగతి వర్గాల వారికి వ్యాక్సిన్ అందించే దిశగా చర్యలు తీసుకుంటామని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బిల్గేట్స్ అండ్ మిలంద్ గేట్స్ ఫౌండేషన్తో కలిసి వ్యాక్సిన్ ఉత్పత్తికి సిరమ్ శ్రీకారం చుట్టింది.
ఒక్కో డోసు రూ.250 ఉండే విధంగా.. మధ్యతరగతివారికి మిలంద్గేట్స్ ఫౌండేషన్ ద్వారా అందించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు సిరమ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇక భారత్ బయోటెక్ రూపిందిస్తున్న కోవాగ్జిన్ సైతం ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ కోసం దేశంలోని 12 ప్రయోగ కేంద్రంల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
ఆ ఆలయంలో 400మంది సేవకులకు కరోనా
ఒడిశాలో ప్రముఖ క్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో 400మంది సేవకులు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని తాజాగా ఆలయ అధికారులు వెల్లడించారు. పూరీ దేవాలయాన్ని తిరిగి తెరవాలని భక్తుల నుంచి ఒత్తిడి పెరుగుతున్న సమయంలో 400 మందికి వైరస్ సోకినట్టు వచ్చిన వార్తలు ఆందోళనకు గురిచేస్తోంది. మార్చి నెల నుంచి ఇక్కడ భక్తుల దర్శనాలను నిలిపివేశారు. 'పూరీ ఆలయంలో ఇప్పటివరకు మొత్తం 404మందికి వైరస్ సోకింది. వీరిలో 351మంది సేవకులు ఉండగా, మరో 53మంది సిబ్బంది ఉన్నారు. వైరస్ బారినపడిన వారిలో ఇప్పటివరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 16మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు' అని జగన్నాథ ఆలయ పర్యవేక్షణ అధికారి అజరు కుమార్ జేనా వెల్లడించారు.
కలెక్టర్కు వ్యతిరేకంగా ఒకేసారి 89 మంది వైద్యుల రాజీనామా
మహారాష్ట్రలో యవత్మల్ జిల్లా కలెక్టర్ ఎండి. సింగ్ వైఖరికి నిరసనగా 89 మంది వైద్యులు ఒక్కసారిగా రాజీనామాలు చేశారు. తమతో అమర్యాదగా ప్రవర్తించిన కలెక్టర్ను బదిలీ చేసేంతవరకు తాము విధులకు హాజరుకాబోమన్నారు. ఈ విషయాన్ని మెడికల్ అసోసియేషన్ ధ్రువీకరించింది.