Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
జాతీయ పరిశ్రమల పార్లమెంట్ కమిటీ చైర్మెన్ గా టీఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు నియమితులయ్యారు. అలాగే, వాణిజ్య కమిటీ చైర్మెన్ గా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి అవకాశం దక్కింది. ఇదే కమిటీలో నామా నాగేశ్వర్ రావు(టీఆర్ఎస్), ధర్మపురి అర్వింద్(బీజేపీ)లు సభ్యులుగా ఉన్నారు. లోక్ సభ సెక్రెటేరియట్ మంగళవారం 24 స్టాండింగ్ కమిటీలకు నూతన చైర్మెన్లు, సభ్యులను ఎంపిక చేస్తూ జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి పలువురు ఎంపీలకు చోటు దక్కింది. పట్టణాభివృద్ధి కమిటీలో బండి సంజరు(బీజేపీ), రైల్వే శాఖ స్టాండింగ్ కమిటీలో జి. సంతోష్ కుమార్(టీఆర్ఎస్), ఆరోగ్య శాఖ కమిటీలో మాలోతు కవిత(టీఆర్ఎస్) లు సభ్యులుగా నియమితులయ్యారు. రవాణా, పర్యాటక, సాంస్కృతిక కమిటీలో డి శ్రీనివాస్(టీఆర్ఎస్) కు చోటు శాస్త్ర సాంకేతిక, పర్యావరణ కమిటీలో కొత్త ప్రభాకర్ రెడ్డి(టీఆర్ఎస్), లా అండ్ జస్టిస్ కమిటీలో కేఆర్ సురేశ్ రెడ్డి(టీఆర్ఎస్), బి వెంకటేశ్ నేత(టీఆర్ఎస్), సమాచార సాంకేతిక కమిటీలో రంజిత్ రెడ్డి(టీఆర్ఎస్), ఎనర్జీ కమిటీలోఉత్తమ్ కుమార్ రెడ్డి(కాంగ్రెస్), విదేశీ వ్యవహారాల కమిటీలో మన్నె శ్రీనివాస్ రెడ్డి(టీఆర్ఎస్), కోల్ కమిటీలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(కాంగ్రెస్), లింగయ్య యాదవ్(టీఆర్ఎస్) లు సభ్యులుగా నియమితులయ్యారు. రక్షణ కమిటీకి చైర్మెన్ గా నియమితులు కాగా.. రాహుల్ గాంధీ(కాంగ్రెస్), రేవంత్ రెడ్డి(కాంగ్రెస్), లక్మీకాంతారావు(టీఆర్ఎస్) లకు సభ్యులుగా చోటు దక్కింది. అలాగే, కార్మిక శాఖ స్టాండింగ్ కమిటీలో టీఆర్ఎస్ ఎంపీలు బండ ప్రకాశ్, పసునూరి దయాకర్లు నియమితులయ్యారు.