Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో క్యాబినెట్ ఆమోదానికి..మోడీ సర్కార్ ప్రణాళికలు
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో 25 శాతం వాటాలను మార్కెట్ శక్తులకు విక్రయించడానికి మోడీ సర్కార్ కసరత్తును వేగవంతం చేసింది. ఈ వాటా విక్రయ ప్రతిపాదనకు త్వరలోనే క్యాబినెట్ ఆమోదం తెలపనుందని సమాచారం. అనంతరం ఎల్ఐసీకి సంబంధించిన చట్టాన్ని పార్లమెంట్లో సవరించడానికి ప్రణాళికలు రూపొందిస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వారు వెల్లడించారు.
ఈ కసరత్తు అంతా గుట్టుగా సాగుతుందని పేరు చెప్పుకోవడానికి ఆసక్తి చూపని ఓ ఉన్నతాధికారి తెలిపారని బ్లూమ్బర్గ్ ఓ కథనంలో వెల్లడించింది. మార్కెట్ పరిస్థితులను బట్టి దశల వారిగా వాటాల విక్రయానికి ప్రతిపాదనలు సిద్దమవు తున్నాయన్నారు. ఎల్ఐసీలో వాటాలను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక లోటును పూడ్చుకోవాలని భావిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ పీఎస్యూల్లో రూ.2.1 లక్షల కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించాలని బడ్జెట్లో మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు రూ.5,700 కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించింది. ఎల్ఐసీలో వాటాల విక్రయం కోసం ఇప్పటికే ప్రభుత్వం డెలాయిట్ టచీ టొమట్సు ఇండియా, ఎస్బీఐ కాపిటల్ సంస్థలు ఎల్ఐసీలో వాటాల విక్రయ విధానాన్ని రూపొందించనున్నాయి.