Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 26న చలో ఢిల్లీ..
- అన్నదాతలపై నిరంకుశ వైఖరి సరికాదు : హన్నన్ మొల్లా
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీ నుంచి అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ(ఏఐకేఎస్సీసీ) వెల్లడించింది. నవంబర్ 26-27 తేదీల్లో చలోఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టాలని తీర్మానించింది. దాదాపు 208 రైతు సంబం ధిత సంఘాలు ఈ ఆందోళనా కార్యక్రమాలను దేశం మొత్తంగా నిర్వహిస్తాయని తెలిపాయి. ఈ మేరకు మం గళవారం ఢిల్లీలో ఏఐకేఎస్సీసీ ప్రతినిధులు సంయు క్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా మాట్లా డుతూ.. సెప్టెంబర్ 25న అగ్రిబిల్లులు, కార్మిక చట్టాల రద్దుకి నిరసనగా జరిగిన భారత్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతాంగం, కార్మికవర్గానికి ఆయన అభినందనలు తెలిపారు. దేశంలోని మొట్టమొదటిసారి భారతరైతాంగం మొత్తం ఆందోళన చేశారని హర్షం వ్యక్తం చేశారు. 20 రాష్ట్రాల్లోని రైతులు రోడ్డుపైకి వచ్చి తీవ్రంగా ఆందోళన చేపట్టారని తెలిపారు. రైతులు, కార్మికుల జీవన స్థితిగతులను దెబ్బకొట్టే విధంగా మోడీ సర్కారు చట్టాలు రూపకల్పన చేసిందని మండిపడ్డారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో దాదాపు 15 మిలియన్ల (1.5 కోట్ల అన్నదాతలు) రైతులు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. రైతుల నుంచి ఇంత స్థాయిలో వ్యతిరేకత వస్తున్నా... కేంద్రం మాత్రం నిరంకుశంగా ముందు వెళ్ళేందుకు యోచించడం దారుణమని అన్నారు. ఈ బిల్లు అమలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆందోళనలు, నిరసనల ద్వారా ఒత్తిడి చేస్తామని రైతు స్వాభిమాన్ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ చెప్పారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ అసెంబ్లీలో బిల్లుకి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఏఐకేఎస్ సీసీ పిలుపునిచ్చిందన్నారు. రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఈ బిల్లు రా జ్యాంగంలోని ఫెడరలిజం సూత్రాలను ఉల్లంఘిస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తాము ఈ రైతు వ్యతిరేక బిల్లులపై అన్నదాతలకు అండగా ఆందోళన నిర్వహిస్తామని ఏఐకేఎస్సీసీ కన్వీనర్ విఎం సింగ్ స్పష్టం చేశారు.
ఏఐకేఎస్సీసీ తీర్మానాలు
- అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడంతోపాటు రాష్ట్రాల్లో బిల్లుని పార్లమెంట్లో వ్యతిరేకించని పార్టీలను గ్రామ స్థాయిలో సమావేశం పెట్టి సాంఘికంగా బహిష్కరించాలని ప్రతిజ్ఞ చేయడం.
- అక్టోబర్ 14న ఎంఎస్పీ అధికార్ దివాస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో నిర్వహించడం. ఆ ఆందోళనా కార్యక్రమంలో మోడీ ప్రభుత్వం ఎంఎస్పీపై చేస్తున్న తప్పుడు సమాచారాన్ని రైతులకి వివరించి నిరసన తెలపడం.
- నవంబర్ 26-27 తేదీల్లో రైతులందరితో చలో ఢిల్లీ నిరసన నిర్వహించడం. కేంద్రం ప్రభుత్వం ఈ బిల్లులను వెనక్కి తీసుకునే వరకు 'మేము పోరాడుతాం... మేము గెలుస్తాం' అన్న నినాదంతో ముందుకు వెళ్ళడం.