Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో దళిత యువతిపై సామూహిక లైంగికదాడి
- ఢిల్లీ ఆస్పత్రిలో రెండు వారాలుగా మృత్యువుతో పోరాటం
- ఢిల్లీ ఆస్పత్రిలో రెండు వారాలుగా మృత్యువుతో పోరాటం
న్యూఢిల్లీ : గత రెండువారాలుగా మృత్యువుతో పోరాడుతున్న హత్రాస్ లైంగికదాడి బాధితురాలు ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ పట్టణానికి చెందిన ఎస్సీ యువతిపై నలుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడటమేకాక.. ఆమెను నాలుక కోసి చిత్రహింసలకు గురిచేశారు. యువతి తన కుటుంబసభ్యులతో కలిసి గడ్డి కోస్తుండగా నలుగురు వ్యక్తులు వచ్చి ఆమెను దుపట్టాతో లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. ఉన్నతవర్గానికి చెందిన నలుగురు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ క్రమంలో బాధితురాలిని తొలుత యూపీలోని అలీగఢ్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రిలోని ఐసీయూకి తరలించారు. యువతి చికిత్స పొందుతూ మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తాము ఫిర్యాదు చేసినా యూపీ పోలీసులు పట్టించుకోలేదని బాధిత యువతి కుటుంబసభ్యులు ఆరోపించారు. కాగా ఈ నెల 14న జరిగిన ఈ పాశవిక ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఫిర్యాదు తీసుకోవడంలో జాప్యం చేశారంటూ పోలీసుల తీరుపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత హేయమైన రీతిలో ఆమెపై లైంగిక దాడి చేసిన మృగాళ్లను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాము నిందితులను అరెస్టు చేశామని హత్రాస్ పోలీసు అధికారి ప్రకాష్ కుమార్ తెలిపారు.