Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వైస్ ప్రెసిడెంట్ కార్యాలయం మీడియాకు వెల్లడించింది. రోజువారి పరీక్షల్లో భాగంగా మంగళవారం ఆయన నిర్వహించిన టెస్ట్ ల్లో కోవిడ్ 19 సోకినట్టు వెల్లడైందని తెలిపింది. అయితే, ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారనీ, వైరస్ లక్షణాలు లేవని పేర్కొంది. వైద్యుల సూచనల మేరకు హౌం క్వారెంటైన్లో ఉన్నట్టు వెల్లడించింది. ఉప రాష్ట్రపతి సతీమణి ఉషకు మాత్రం నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.