Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దాదాపు మూడు దశాబ్దా లుగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో తుది తీర్పు నేడు వెలువడనుంది. ఈ మేరకు లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితులలో ఉన్న 33 మంది బీజేపీ, సంఫ్ు పరివార అగ్రనేతలను కోర్టుకు హాజరు కావాలని లక్నో బెంచ్ ఇదివరకే ఆదేశించిన విషయం తెలిసిందే. నేడు కోర్టుకు హాజరు కావాల్సిన వారిలో మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీ, కేంద్ర మాజీ మంత్రి మురళి మనోహర్ జోషి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి, భజరంగ్దళ్ నేత సీనియర్ ఎంపీ వినయ కట్టియార్ వంటి నేతలున్నారు. 2014 ఎన్నికల తర్వాత ఆ నేతలకు బీజేపీలో ప్రాధాన్యత తగ్గింది. మరి ఈ
కేసులో వారిపట్ల కోర్టు తీసుకునే తీర్పును ఆర్ఎస్ఎస్ ప్రభావితం చేస్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తీర్పు వెలువరించ నున్న నేపథ్యంలో శాంతిభద్రతలపై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. తీర్పు వెలువడిన అనంతరం సున్నితమైన ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తే అవకాశముందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.