Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్
- నవంబర్ 3న పోలింగ్... 10న ఫలితాలు
- దేశవ్యాప్తంగా మరో 56 అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి తేదీలు ఖరారు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక శాసనసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ఉపఎన్ని కకు షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ మేరకు ఈసీ మంగళవారం ఢిల్లీలో మీడియాకి వెల్లడించింది. తెలంగాణ లోని దుబ్బాకతో పాటు... దేశవ్యాప్తంగా మరో 56 అసెంబ్లీ స్థానాలు, బీహార్లోని వాల్మీకి ఎంపీ నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 16 నామినేషన్ల స్వీకరణకు చివరి తేది, అక్టోబర్ 17న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 19న నామినేషన్ల ఉప సంహ రణ గడువును ప్రకటించింది. కాగా, నవంబర్ 3 ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్10న ఫలితాలు వెల్లడికానున్నట్టు ఎన్నికల సంఘం వివరించింది.
11 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు
దుబ్బాకతోపాటు దేశవ్యాప్తంగా మొత్తం 11 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అత్యధికంగా మధ్యప్రదేశ్లోని 27 స్థా నాలు ఉన్నాయి. గుజరాత్లో ఎనిమిది స్థానాలు, యూపీలో ఏడు స్థానాలు, జార్ఖండ్, కర్నాటక, మణిపూర్, నాగాలాండ్, ఒడిశాలో రెండేసీ స్థానాలు, చత్తీస్గడ్్, హర్యానాలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దుబ్బాకతో పాటు 54 స్థానాలకు నవంబర్ 3 పోలింగ్ జరగనుండగా.. బీహార్లో
లోక్సభస్థానంతో పాటు, మణిపూర్లోని రెండు స్థానాలకు నవంబర్ 7 పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి రానుందని ఈసీ స్పష్టం చేసింది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
దుబ్బాక ఉపఎన్నికల షెడ్యూల్...
షెడ్యూల్ విడుదల అక్టోబర్ 9
నామినేషన్ల ఆఖరి తేది అక్టోబర్ 16
నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 17
నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ 19
పోలింగ్ నవంబర్ 3
ఫలితాలు నవంబర్ 10