Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో 12శాతం విద్యకు కేటాయింపులు
- 'మహాఘట్ బంధన్' కూటమి మ్యానిఫెస్టో
న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. 'మహాఘట్ బంధన్' అధికారంలోకి వస్తే మోడీ సర్కార్ ఇటీవల చేసిన నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తామని సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ అన్నారు. ముఖ్యం గా తమ కూటమి అధికారం లోకి రాగానే యువతకు ఉద్యోగాలు, ప్రత్యేక హోదా తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తాను స్వచ్ఛమైన బిహారీని అని తన
డీఎన్ఏ స్వచ్ఛమైందని తేజస్వీ వ్యాఖ్యానించారు. తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని 'మహాఘట్ బంధన్' కూటమి మ్యానిఫెస్టోను శనివారం విడుదల చేశారు. కాంగ్రెస్ నాయకులు రణదీప్ సూర్జేవాలా, శక్తిసింV్ా గోహిల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ్ల 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో అక్టోబరు 28 నుంచి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల ఫలితాలు నవంబరు 10న వెలువడుతాయి. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ...రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిగి రావాల్సిన అవసరం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీశ్ ది డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని, గత15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా, ప్రయోజనమేమీలేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని అన్నారు. వారికి అధికార దాహం తప్ప ప్రజల సంక్షేమంపై దృష్టి లేదంటూ ఆరోపణలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఫారాలు ఉచితం చేస్తా మన్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థుల ప్రయాణ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందన్నారు.
అలాగే బడ్జెట్ లో 12 శాతం విద్యకు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన వాగ్దానాలను తుంగలోకి తొక్కారనీ, ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమని ఆరోపించారు. మోతియారి షుగర్ మిల్లులో కప్పు టీ తాగుతానని చెప్పిన ప్రధాని, రాష్ట్రంలో వరుసగా చక్కెర మిల్లులు, జనపనార మిల్లులు, పేపర్మిల్లులు, రైస్ మిల్లులను మూసివేసారని తెలిపారు. నితీష్ కుమార్ నాయకత్వంలోని, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కనీసం 60 కుంభకోణాలు జరిగాయనీ, నేరాలు పెరిగి పోయాయని వ్యాఖ్యానించారు.