Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ(ఎల్జెపి) రెండవ దశ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తాజాగా విడుదల చేసింది. మొత్తం 53 మంది అభ్యర్థులను పోటీచేస్తున్నారు. కాగా, ఇందులో ట్రాన్స్ జెండర్కు అవకాశం కల్పించింది. హథువా స్థానం నుండి రామ్ ప్రసాద్ అలియాస్ మున్నా అనే హిజ్రాకు టిక్కెట్ ఇచ్చింది. ఎల్జెపి మొదటి దశ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో 95 మంది పేర్లను కూడిన జాబితాను విడుదల చేసిన సంగతి విదితమే. తాజాగా రెండవ దశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సాగుతుండగా మున్నా తన నామినేషన్ దాఖలు చేశారు. గోపాల్గంజ్ జిల్లాలోని సెలారక్లా గ్రామ నివాసి అయిన మున్నా ప్రస్తుతం హథువాలో కౌన్సిలర్గా ఉన్నారు. దీనికి ముందు మున్నా జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.