Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక సంఖ్యలో ప్రజలతో సభలు, ర్యాలీలు
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల ఉల్లంఘన జరుగుతోంది. బహిరంగ సభలు, ర్యాలీల్లో 200 మంది కంటే ఎక్కవ మించరాదని, కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలన్న సూచనలను ప్రచార పర్వంలో పలు పార్టీలు తుంగలో తొక్కుతున్నాయి. ఇలీవల చాప్రాలో జెడియు అభ్యర్ధి, తేజ్ ప్రతాప్ యాదవ్ మాజీ మామ అయిన చంద్రికా రారు ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ర్యాలీ అనంతరం అక్కడ నిర్వహించిన సభపై భారీ సంఖ్యలో నేతలు, ఇతరులు ఉండడంతో అది కుప్పకూలింది. గయాలో అయితే బిజెపి జాతీయాధ్యక్షుడు జెడి.నడ్డా పాల్గొన్న ఒక సభ నిర్వాహకులపై స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సభలో పాల్గొన్న కార్యకర్తలు భౌతిక దూరం నిబంధనలను ఉల్లంఘించట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్జెడి నేతలు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లో నామినేష్ దాఖలు చేసే సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించి భారీ సంఖ్యలో ప్రజలతో మినీ రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భాలే కాకుండా పార్టీలు తమ బలాన్ని నిరూపించుకునేందుకు ఎన్నికల ప్రచార పర్వంలో కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
నామినేషన్ దాఖలు, ప్రచారానికి సంబంధించి ఎన్నికల సంఘం కరోనా నేపథ్యంలో ప్రజల హాజరుపై ఆంక్షలు విధించింది. అయితే అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో నేతలు ఈ విధంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. బిజెపి నేతలు అయితే దేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించి కొత్త బాష్యం చెప్పుకొస్తున్నారు. బీహార్కు చెందిన కేంద్ర మంత్రి ఒకరు మాట్లాడుతూ దేశంలో కరోనా పని అయిపోయిందని అందరూ అనుకుంటున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో అయితే అసలు ఇది సమస్యే కాదని వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో మాస్కు ధరించడం అరుదు అని, మాస్కు వేసుకోవడం అంటే గడ్డి పెట్టేందుకు పశువుల మెడలో వేసే బాజీ వంటదని అన్నారు.