Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన నిందితుడు బీజేపీ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ అరెస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బల్లియా కాల్పుల ఘటన ప్రధాన నిందితుడైన బీజేపీ నాయకులు ధీరేంద్ర ప్రతాప్ సింగ్ను ఆ రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఆదివారం ఆరెస్టు చేసింది. ఆయనతో పాటు మరింత మంది నిందితులను బల్లియాలోని వైశాలి ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిని అత్యంత రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్టు సమాచారం. కాగా, రేవతి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్జన్పూర్ గ్రామంలో స్వయం సంఘాలకు రేషన్ దుకాణాలు కేటాయించే విషయమై గురువారం జరిగిన సమావేశంలో వివాదం తలెత్తగా.. జై ప్రకాశ్ అనే వ్యక్తిని బీజేపీ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ తుపాకీతో కాల్చి చంపాడు.
ఈ ఘటనకు సంబంధించి శనివారమే ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 8 మందిని నిందితులుగా పేర్కొన్నప్పటికీ.. మొత్తం గుర్తు తెలియని 25 మంది పేర్లను సైతం ఎఫ్ఐఆర్లో చేర్చారు. అలాగే, పరారీలో ఉన్న ముగ్గురిపై రూ.50 వేల రివార్డును సైతం పోలీసులు ప్రకటించారు. కాల్పులకు పాల్పడిన బీజేపీ నేత ధీరేంద్ర ప్రతాప్ సింగ్కు ఆ పార్టీకి చెందిన బరియా నియోజకవర్గం ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ అనుకూలంగా మాట్లాడటం గమనార్హం. తన ప్రాణాలు కాపాడుకోవడానికే నిందితుడు కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. అయితే, ఈ పోలీసుల ముందే బీజేపీ నేతలు కాల్పులు జరపడం పట్ల రాష్ట్ర ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తు న్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో యోగి సర్కారు విఫలమైందని ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు.