Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించని
నాయకులు, అధికారులు
- కర్నాటకలో బీజేపీ సర్కారు తీరుపై
ప్రజల ఆగ్రహం
బెంగళూరు : భారీ వర్షాలతో కర్నాటకలోని కలబురగి అతలాకుతలమైంది. వరదలతో పలు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకొని ఆదుకోవాల్సిన నాయకులు, అధికారులు తమ విధులను విస్మరిస్తున్నారు. దీంతో వారి తీరుపై కలబురగివాసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సర్కారు తీరును వారు ఎండగడుతున్నారు. ఫిరోజాబాద్లో రెవిన్యూ మంత్రి ఆర్.అశోక్కు ప్రజలు, రైతులు నిరసన తెలిపారు. టీవీల్లో కనిపించడానికి, పత్రికల్లో ఫొటోల కోసమే ఇక్కడ పర్యటిస్తున్నారనీ, ప్రజల కష్టాలను పరిష్కరించాలన్న కనీస బాధ్యత లేదని నిరసనకారులు మంత్రి తీరును తప్పుబట్టారు. ఇక హోంగూట్ట గ్రామంలో దాదాపు 500 ఇండ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. తినడానికి తిండి, తాగడానికి కనీసం నీరు కూడా వారికి లేదు. అయితే గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే, ఆ తర్వాత సదరు గ్రామంలో పర్యటించిన ఓ ప్రభుత్వ అధికారిని గ్రామస్థులు దాడి చేసే ప్రయత్నం చేశారు. గ్రామీణాభివృద్ధి, పంజాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప కలబురగికి వచ్చినప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించలేదు. కలబురగి ఇన్చార్జీగా ఉన్న కర్నాటక ఉప ముఖ్యమంత్రి గోవింద్ జిల్లాలో పర్యటించే సాహసం చేయలేదు. బీజేపీ సర్కారు రాజకీయాలపై ఉన్న శ్రద్దలో కొంచెం తమ కష్టాలపై పెట్టి వారిని ఆదుకోవాలని ప్రభావిత ప్రాంతాల బాధితులు అన్నారు.