Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్ఓసీ వెంబడి తొమ్మిది మంది
అసోం రైఫిల్వుమన్ విధులు
న్యూఢిల్లీ : నిషేధిత మాదక ద్రవ్యాల సరఫరాకు అడ్డుకట్ట వేయడానికి మహిళా సైనికులు తమ వంతు కృషి చేస్తున్నారు. నియంత్రణ రేఖా వెంబడి(ఎల్ఓసీ) గస్తీ కాస్తూ దేశంలోకి డ్రగ్స్ సరఫరా కాకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎల్ఓసీ వెంబడి దాదాపు 10వేల ఫీట్ల ఎత్తులో ఎముకలు కొరికే చలిలో వారు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. పారా మిలిటరీ ఫోర్స్ అసోం రైఫిల్స్కు చెందిన తొమ్మిది మంది మహిళా సైనికులకు కుప్వారా-తాంగ్దర్ రహదారి మీదుగా సాధ్నా పాస్ వద్ద ఈ ఏడాది జుల్లైలో అధికారులు విధులను కేటాయించారు. ఎల్ఓసీ వెంట జరిగే నార్కొటిక్స్ స్మగ్లింగ్ను నిరోధించే చర్యల్లో భాగంగా మహిళా సైనికులను అక్కడ మోహరింపచేశారు. ఆర్మీ కింద పని చేస్తున్న తొలి మహిళా సైనికులు వీరే కావడం గమనార్హం. మహిళా సంబంధ కార్యకలాపాలు ఏవైనా.. ఈ తొమ్మిది మంది మహిళా సైనికుల బృందం హ్యాండిలల్ చేస్తోందని అధికారులు తెలిపారు. స్థానిక ప్రజలు మమ్మల్ని చూసి చాలా సంతోషిస్తున్నారని రైఫిల్వుమన్ నీతూ కుమారీ తన అనుభవాల్ని పంచుకున్నారు. ''స్థానికులు వారి సమస్యలను మాకు చెప్పుకుంటారు. మమ్మల్ని చూసి వారి పిల్లలు ప్రేరణ పొందుతున్నారు'' అని ఆమె తెలిపారు. ఇక్కడ పని చేయడం తనకు చాలా అనుభూతినిచ్చిందని సీనియర్ రైఫిల్వుమన్ హెచ్ వాంజెన్ కోన్యేక్ అన్నారు. ఇక్కడ వాతావరణ చాలా చల్లగా ఉంటుందనీ, అదే మాకు సవాలు అని చెప్పారు.