Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్సీసీ
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రైతు సంఘాలు సిద్ధమౌతున్నాయి. ఇందులో భాగంగా రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ప్రచారం చేయాలని ఆఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ(ఏఐకేఎస్సీసీ) నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్లో అప్రజాస్వామికంగా బిల్లులను ఆమోదింపజేసుకున్న బీజేపీ తీరును రాష్ట్రంలోని రైతులు, ప్రజలకు వివరిస్తామని నేతలు పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఎఐకెఎస్సిసి నవంబర్ 26, 27 తేదీల్లో పార్లమెంట్ మార్చకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించేందుకు ప్రచారం నిర్వహిస్తామని ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్ మోల్లా తెలిపారు.