Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హత్రాస్ ఘటనలో యూపీ అధికారుల తీరుపై మాలిని భట్టాచార్య
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ లైంగికదాడి ఘటనకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను నాశనం చేసే దిశగా అక్కడి ప్రభుత్వం, అధికారులు తీరు ఉన్నదని సామాజిక కార్యకర్త, పశ్చిమ బెంగాల్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్, జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు మాలిని భట్టాచార్య పేర్కొన్నారు. నిందితులు అధికారుల చేత రక్షించబడుతున్నారనీ, తాము ఏం చేసినా సులభంగా తప్పించుకోగలుగు తామన్న నమ్మకం వారిలో నెలకొన్నదని అన్నారు. అధికారుల తీరు కారణంగా దళితులు, అణగారిన వర్గాల ప్రజలపై పలు రూపాల్లో పెత్తందారుల దాడులు, దారుణాలు చోటుచేసుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు. హత్రాస్ లైంగికదాడి ఘటనకు సంబంధించి ఆమె ఆన్లైన్ వెబ్పోర్టల్ టెలిగ్రాఫ్ ఇండియా ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. లైంగికదాడి ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపడంలో ఉద్దేశపూర్వక ఆలస్యం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు ప్రదర్శించిన అలసత్వం, బాధితురాలికి తగిన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం, మెడికల్ సర్టిఫికెట్ తయారీలో చోటుచేసుకున్న ఆలస్యం, మరీ ముఖ్యంగా కుటుంబం అనుమతి, వారికి సమాచారం లేకుండా బాధితురాలి మృతదేహాన్ని రాత్రికిరాత్రే దహనం చేసిన తీరు చేస్తుంటే ఈ ఘటనకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను ఒక ప్రణాళిక ప్రకారం నాశనం చేసేందుకు అధికారులు అడుగులు వేస్తున్నారని మాలిని భట్టాచార్య పేర్కొన్నారు. లైంగికదాడి దారుణానికి బాధితురాలే తొలి సాక్ష్యమని, ఘటన జరిగిన సెప్టెంబర్ 14వ తేదీనే ఆమె ఓ వీడియోలో ఈ విషయాన్ని వెల్లడించిదని భట్టాచార్య అన్నారు. అదే నెల 22న జిల్లా కలెక్టర్కు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా తనపై లైంగికదాడి జరిగిన విషయాన్ని ఆమె చెప్పారనీ, తనపై దాడి చేసిన నలుగురి పేర్లను కూడా బాధితురాలు కలెక్టర్కు తెలిపారని భట్టాచార్య పేర్కొన్నారు. ఈ మరణ వాంగ్మూలానికి దర్యాప్తు సమయంలో చట్టపరంగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. అయితే ఒకవైపు బాధితురాలి స్టేట్మెంట్ ఉన్నా.. ఫోరెన్సిక్ నివేదికను చూపుతూ లైంగికదాడికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవని యూపీ పోలీసులు బహిరంగంగా ప్రకటించడం వారు అప్పటికే తీసుకున్న వైఖరికి అద్దం పడుతోందని అన్నారు.