Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 40 లక్షల మార్కును దాటడంతో.. కరోనా మహమ్మారి నాల్గవ దశ (తీవ్ర వ్యాప్తి) లోకి ప్రవేశించిందని అంటువ్యాధుల నిపుణులు పేర్కొంటున్నారు. యూరోపియన్ దేశాల్లో రెండో దశలో, అమెరికాలో మూడవ దశలో ఉండగా, భారత్, దక్షిణ అమెరికాల్లో మొదటి దశ ముగింపులో ఉన్నాయని అన్నారు.
2019 డిసెంబర్, 2020 ప్రారంభంలో చైనాలో కరోనా మహమ్మారి మొదటి దశ ప్రారంభమైంది. అయితే ఫిబ్రవరి చివరి నాటికి చైనా కరోనా వ్యాప్తిని నివారించగలిగింది. దీంతో మొదటిదశ ముగిసింది. యూరప్లో మార్చిలో రెండో దశ ప్రారంభమైందని, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, జర్మనీలు హాట్స్పాట్లుగా నిలిచాయి. మే చివరి నాటికి అమెరికాలో ప్రారంభమైంది. ఇక్కడి నుండి మూడవ దశ ప్రారంభమైనట్టు భావిస్తున్నారు. ఆగస్టు సెప్టెంబరులలో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. రోజువారీ కేసులు కూడా అధిక సంఖ్యలో నమోదయ్యాయి. అదేవిధంగా ఆగస్టు నాటికి భారత్లో వైరస్ విజృంభణ ప్రారంభమైంది.
వరల్డ్ ఒమెటర్స్.ఇన్ఫో ప్రకారం.. గతవారంలో అమెరికాలో సగటున 55,917 కొత్త కేసులు నమోదైనట్టు పేర్కొంది. ఆగస్టు మొదట్లో ఆగస్టులో నమోదైన కరోనా కేసులు ఉధృతి తగ్గుతున్న తరుణంలో, మరోసారి అత్యధిక కేసులు నమోదవడంతో రెండోదశ ప్రారంభమైనట్లుగా పేర్కొన్నారు. ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియాలతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో కొత్త కేసులుపెరిగాయి. మూడోదశలో రెండో దశను అధిగమించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
యూరప్లో కొత్త కేసులు అత్యధికంగా వస్తూనే ఉన్నాయి. శుక్రవారం మొదటిసారిగా 1.50 వేల కేసులను దాటింది. రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ దేశాలు రెండో దశలో అత్యధిక కేసులను నమోదు చేస్తున్నాయి. దీంతో ఆయా దేశాల్లో రెండోసారి లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. ఫ్రాన్స్లో శనివారం నుండి రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఇటీవల కేసులను నియంత్రించేందుకు మరోసారి లాక్డౌన్ విధించక తప్పదని బ్రిటన్ ప్రధాని బోరిక్ జాన్సన్ కూడా ప్రకటించారు.
మరోవైపు భారత్లో రెండోదశ కొనసాగుతోంది. భారత్లో ప్రతి రోజూ 63వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. సెప్టెంబర్ మధ్యలో గరిష్టస్థాయి నుంచి 33 శాతానికి పడిపోయింది. జూన్ మధ్య నుంచి లెక్కిస్తే.. ఈ సంఖ్య కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం రోజువారీ కేసులు 55వేలకు పైగా నమోదవడంతో ప్రస్తుతం భారత్ అమెరికా తరువాతి స్థానంలో కొనసాగుతోంది.