Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో రైల్వేల్లో 'ప్యాంట్రీ కార్స్' (వంటశాల కలిగిన బోగి) సేవలు ఆగిపోయాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు రైల్వే ప్రయాణాలు కొద్దిగా గాడిలో పడుతున్న క్రమంలో, రైల్వేల్లో ఇంకా ప్యాంట్రీ కార్స్ సేవల్ని కేంద్రం పునరుద్ధరించక పోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బయట కొనుగోలు చేసినవో, ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహార పదార్థాల్నే ప్రయాణీకులు రైళ్లలో తింటున్నారు. దాంతో ప్యాంట్రీ కార్స్ సేవలపై ఆధారపడ్డ దాదాపు 10వేల మందికిపైగా సిబ్బంది కొలువు గల్లంతైంది. దాదాపు 350కిపైగా ప్రీమియం రైళ్లలోని 'ప్యాంట్రీ కార్స్'లో వేలాది మంది వంటవాళ్లు, వెయిటర్లు, ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. కోవిడ్-19 సంక్షోభం కారణంగా వీరి సేవల్ని మోడీ సర్కార్ నిలిపివేసింది. దాంతో వీటిపై ఆధారపడిన వారి ఉపాధి తీవ్రంగా ప్రభావితమైంది.