Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రభావం తగ్గడం లేదు. వైరస్ వ్యాప్తి కోనసాగుతుం డటంతో దేశంలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య 75 లక్షలు దాటింది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 55,722 మంది కరోనా బారినపడ్డారు. ఇదే సమయంలో 579 మంది వైరస్తో పోరాడుతూ ప్రాణాలు కోల్పో యారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,14,610కి పెరిగింది. పాజిటివ్ల సంఖ్య 75,52, 262కు పెరిగింది. ఇప్పటివరకూ 66,63, 608 మంది కోలుకున్నారు. కరోనా రోగుల్లో కొంత మందికి నెలల గడిచిన తర్వాత కూడా కోవిడ్-19 లక్షణాలు బయటపడుతు న్నాయని బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తాజాగా వెల్లడించారు.
ముక్కు ద్వారా కరోనా టీకా..!
కరోనా వైరస్ కట్టడి కోసం ముక్కు ద్వారా ఉపయోగించే టీకా చివరిదశ ప్రయోగాలను దేశంలో భారీస్థాయిలో చేపట్టనున్నారు. ప్రాథమిక దశ తర్వాతి దశ ట్రయల్స్ను భారత్కు చెందిన ఫార్మా సంస్థలు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ చేపట్టనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఓ ప్రకటనలో తెలిపారు. వ్యాక్సిన్ కోసం వంద కోట్ల సిరంజీలు : యూనిసెఫ్
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయోగాలు తుది దశకు చేరుకున్న తరుణంలో టీకా పంపిణీపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా వచ్చే ఏడాది చివరికల్లా ప్రపంచవ్యాప్తం గా వంద కోట్ల సిరంజిలను అందుబాటులో ఉంచుతామని యూనిసెఫ్ వెల్లడించింది. వీటిలో ఈ సంవత్సరం చివరినాటికే 52 కోట్ల సిరంజిలను సిద్ధం చేస్తామని ప్రకటించింది.