Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిలిగురి (బెంగాల్): దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని త్వరలోనే అమలు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కరోనా వైరస్ విజృం భిస్తుండటంతో.. ఈ చట్టం అమలులో జాప్యం ఏర్పడిందన్నారు. ఉత్తర బెంగాల్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్ర మంలో ఆయన మాట్లాడుతూ పై విధం గా స్పందించారు. మమతా సర్కార్ రాష్ట్రంలో ఉన్నా.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా విభజించి పాలించే రాజకీయాలు చేస్తున్నదని ఆరోపిం చారు. బీజేపీలా అందరి అభివృద్ధి కోసం పని చేయడంలేదని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టంతో అందరికీ ప్రయోజనం చేకూరుతుందనీ.. పార్లమెంట్లోనూ ఈ బిల్లు ఆమోదం పొందిందని గుర్తు చేశారు.