Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నకిలీ టెలివిజన్ రేటింగ్ పాయింట్స(టీఆర్పీ) స్కాంపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కుంభకోణంపై ఉత్తరప్రదేశ్లో వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసేందుకు సీబీఐ ఈ కేసును స్వీకరించింది. గోల్డెన్ రబ్బిట్ కమ్యూనికేషన్ ఫిర్యాదు ఆధారంగా లక్నో పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని యూపీలోని యోగి ఆదిత్యానాద్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. 24 గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి యోగి ప్రతిపాదనకు క్లియరెన్సు వచ్చింది. ఈ రేటింగ్ కుంభకోణంపై ఇప్పటికే రిపబ్లిక్ టీవీతో సహా మూడు ఛానెళ్లపై ముంబయి పోలీసులు విచారణ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన కథనాలపై విభేదించిన పోలీసులు తమపై కక్షపూరితంగా ఈ కేసులో ఇరికించారని, దీనిపై సీబీఐ విచారణ చేయాలని రిపబ్లిక్ టీవీడిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యూపీలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ అధికారులు కేసు నమోదు చేయడం గమనార్హం.