Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్టు మృతి
- ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందగా ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని గోలాకొండా అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. ఘటనా స్థలంలో భారీగా మందుపాతరలు, సాహిత్యం, పేలుడు పదార్థాలు స్వాధీనపర్చుకున్నారు. మావోయిస్టుల ఐఈడీ బాంబుల ప్రతిదాడిలో బండారి రమేష్, రమేష్ హేమ్ల జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఘటనను జిల్లా ఎస్పీ కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు.