Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : కాల్బుర్గి మినీహైడల్ పవర్ ప్లాంట్ ను వరద నీరు ముంచెత్తింది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు.. కృష్ణా నదికి ఉపనదులయిన భీమా, అమర్జా నదులకు వరద ఉధృతి పెరిగింది. మరోవైపు అఫ్జల్పూర్ తాలూకాలోని భీమా నదిపై నిర్మించిన సొన్నా బ్యారేజికి వరద పోటెత్తడంతో 5,91,000 క్యూసెక్కుల వరదనీటిని అధికారులు కిందికి విడుదల చేశారు. ఈ కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కాల్బుర్గి ప్రాంతంలో ఉన్న మినీ హైడల్ పవర్ ప్లాంట్ కూడా నీటమునిగింది. జలదిగ్బంధమయిన సుమారు 50 గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.