Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) విద్యార్థి సంఘం నాయకుడు ఉమర్ ఖాలీద్కు తగిన భద్రత కల్పించండంటూ తీహార్ జైలు అధికారులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉమర్ ఖాలీద్ను అదుపులోకి తీసుకుంది. కోర్టు అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో తీహార్ జైల్లో తనకు తగిన భద్రత కల్పించాలనీ, ఇతర ఖైదీలు తనపై దాడి జరపకుండా రక్షణ ఉండేట్టు చర్యలు తీసుకోవాలని ఉమర్ ఖాలీద్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, భద్రతా చర్యలు తీసుకోవాలని తీహార్ జైలు ఉన్నతాధికారులను ఆదేశించింది. గతంలో కొంతమంది ఉమర్ ఖాలీద్పై దాడి చేయడానికి ప్రయత్నాలు చేశారని, ఇప్పుడు జైల్లో చుట్టూ ఎంతోమంది నేరస్థులు ఉండటం వల్ల ఆయనపై దాడి చేసే అవకాశముందని ఉమర్ ఖాలీద్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. సీఏఏ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మోడీ సర్కార్ తీరును నిరసిస్తూ ఉమర్ ఖలీద్ నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. దీనిని సహించలేకపోయిన కేంద్రం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని అరెస్టు చేసింది. ఢిల్లీ అల్లర్ల కేసులో ఇరికించింది. కేంద్రం వేధింపు చర్యలకు దిగిందని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.