Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బడా కార్పొరేట్లకు మరింత అనుకూలంగా వ్యవహారించేలా మోడీ సర్కార్ త్వరలోనే నూతన ప్రయివేటీకరణ విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. ఇది వచ్చే కొన్ని వారాల్లోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదా నికి రానుందని ప్రభుత్వ ఉన్నతాధికారులు పేర్కొన్నట్టు ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. దీనికి సంబంధిం చిన ముసాయిదా పత్రాన్ని ఇప్పటికే 49 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు పంపించారు. మరో 10-15 రోజుల్లో ఈ ప్రతిపాదత పత్రానికి ఆమోదం లభించనుందని ఓసీనియర్ ఉన్నతాధికారి తెలిపారు. విత్త సంస్థలు, బ్యాంకింగ్, భారత రైల్వేలు, చమురు, గ్యాస్, రక్షణ, అంతరిక్షం, అణు ఇంధనం తదితర వాటిలోనూ ప్రయివేటీకరణను మరింత ముందుకు తీసుకెళ్లేలా బీజేపీ సర్కార్ నిర్ణయాలు చేసింది. నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంక్లు సహా కొన్ని బీమా కంపెనీలనూ గంపగుత్తగా ప్రయివేటుకు విక్రయించ డానికి అనుకూలంగా రూపకల్పన చేశారు. అదే విధంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలను విలీనం చేసే అవకాశాలున్నాయి.
ఏ రంగంలో అయినా ఇకపై నాలుగు ప్రభుత్వ సం స్థలను మాత్రమే కొనసాగించనున్నామని ఆత్మనిర్బర్ భారత్ ప్యాకేజీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏ రంగంలో అయినా ఒక్కటి నుంచి నాలుగు కంపెనీలు మాత్రమే ఉంటాయని.. ఇందుకోసం విలీ నాలు చేపట్టడం లేదా ప్రయివేటు భాగస్వామ్యం పెం చడం చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రకటన అనంత రమే మంత్రిత్వ శాఖ పెట్టిన గడువు సమయంలో నూతన ప్రయివేటీకరణ విధానానికి అధికారులు రూపకల్పన చేశారు. అయితే ఎప్పటి వరకు వాటాలను విక్రయించాలి లేదా ప్రయివేటీకరణను ముగించాలి అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకూ బ్యాంక్ల్లో కొంత మొత్తాల్లో వాటాలను విక్రయిస్తూ వచ్చిన మోడీ సర్కార్ ఇక నూతన విధానంలో ఏకంగా మొత్తం విత్త సంస్థనే ప్రయివేటుకు అప్పగించడానికి అనుకూలంగా నిర్ణయాలు చేపట్టిందని స్పష్టమవు తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) కసరత్తు చేసిందని సమాచా రం. ఇందుకు అనుకూలంగా త్వరలోనే ఆర్బీఐ విధివిధానాల్లోనూ మార్పులు చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. తొలుత నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంక్లను ప్రయివేటుకు కట్టబెట్టడానికి ప్రణాళికల ను సిద్దం చేసింది. ఈ జాబితాలో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ హయంలో ఎనిమిది జీవిత, సాధారణ బీమా కంపెనీలు ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ), జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ తదితర బీమా సంస్థలున్నాయి. వీటిలో పలు బీమా కంపెనీల విలీన ప్రతిపాదన క్యాబినెట్ వద్ద ఇప్పటికే పెండింగ్లో ఉంది. త్వరలోనే దీనికి అమోదం తెలపడం లేదా నూతన విధానంలో ప్రయివేటుకు ధారాదత్తం చేయనుందని తెలుస్తోంది.