Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
హైదరాబాద్ వరద బాధితుల కోసం తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు కేంద్ర హౌంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయ వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. తాజా వరదల నేపథ్యంలో హైదరాబాద్ లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా ముంపు ప్రాంతాల్లో తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. అవసరమైన అన్ని సహాయక చర్యలను వివిధ కేంద్ర, రాష్ట్ర విభాగాలతో సమన్వయం చేస్తున్నట్టు వెల్లడించారు.