Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టును ఆపాలని ఆదేశాలివ్వలేమన్న ఎన్టీజీ
- పునరావాస చర్యల కోసం ఏడుగురితో కమిటీ నియామకం
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించిం దని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) అభిప్రాయపడింది. అయితే, ప్రాజెక్టు నిర్మాణం మధ్యలో ఉన్నందున దాన్ని పూర్తి గా ఆపాలని ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. నిబం ధనల ఉల్లంఘనలతో కలిగిన ఇబ్బందులకు చేపట్టాల్సిన పున రావాస చర్యలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించింది. ఈ మేరకు ఈ విషయాన్ని అంచనా వేసేందుకు కేంద్ర పర్యావరణ పరిరక్షణ, అటవీశాఖ ఆధ్వ ర్యంలో ఏడుగురు సభ్యులతో ఎక్స్పర్ట్ కమిటీ(నిపుణుల బందం)ని వేస్తున్నట్టు వెల్లడించింది. కేసీఆర్ సర్కార్ ప్రతిష్టా త్మకంగా నిర్మిస్తున్న కాళ్వేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన అభ్యంత రాలకు సంబంధించిన పిటిషన్లపై జస్టిస్ ఎకె గోయల్ నేతృత్వంలోని ఎన్జీటీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుకి సంబంధించిన అన్ని పిటిషన్లపై ఇరువర్గాల వాదనలు ఇంతటితో ముగిసినట్టు వివరించింది. ప్రాజెక్టు నిర్మాణంలో సరైన అనుమతులు లేకుండా డిజైన్ మార్చి విస్తరణ పనులు చేపట్టడం సమర్థనీయం కాదని ఎన్జీటీ ధర్మాసనం వ్యాఖ్యానించింది. విస్తరణ కారణంగా చోటు చేసుకున్న ఉల్లంఘనలకి చట్టపరంగా పునరావాసం ఏమి చేయగలమో చూడాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్దేశాలు మంచి పని కోసం అయినప్పటికీ, చట్ట విరుద్ధ చర్యలకు ఒడిగట్టడం సరికాదని గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం పేర్కొంది.