Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దానిని వారి సొంత మ్యానిఫెస్టోతో భర్తీ చేయాలనుకుంటుంది : మెహబూబా ముఫ్తీ
శ్రీనగర్ : బీజేపీపై పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అధినేత్రి, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆగ్రహం క్తం చేశారు. దేశ రాజ్యాంగాన్ని బీజేపీ పడగొట్టిందని విమర్శించింది. దాని స్థానంలో తన సొంత మ్యానిఫెస్టోను తీసుకురావాలని కాషాయపార్టీ భావిస్తున్నదని తెలిపింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం 14 నెలల నిర్బంధం తర్వాత ఆమె తొలిసారి మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. '' బీజేపీ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసింది. బీజేపీ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)నూ తీసుకొచ్చింది. ప్రజలను భావోద్వేగాలతో రెచ్చగొట్టింది. ఇప్పుడు రైతు వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చింది. నాకు తెలిసి వారు(బీజేపీ) దేశంలో దళితుల లాంటి అణగారిన వర్గాల ప్రజల హక్కులను హరిస్తుంది. హిట్లర్ లాంటి వాళ్లు ఎంతో మంది వచ్చారు. కానీ ఇలాంటి నియంతృత్వం పనిచేయబోదు'' అని ఆమె చెప్పారు. బీజేపీ జమ్మూకాశ్మీర్ ప్రజలు అవసరంలేదని అన్నారు. గతేడాది ఆగస్టులో జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని మోడీ సర్కారు రద్దు చేసిన అనంతరం ఆ ప్రాంతానికి చెందిన ప్రధాన నాయకులను మోడీ సర్కారు నిర్బంధించిన విషయం తెలిసిందే.