Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 540 పాయింట్ల పతనం
ముంబయి : ప్యూచర్ గ్రూపు రిటైల్ స్వాధీనం అంశంలో సింగపూర్ కోర్టులో రిలయన్స్ ఇండిస్టీస్కు ప్రతికూలంగా ఆదేశాలు రావడంతో ఆ ప్రభావం భారత మార్కెట్లపై తీవ్రంగా పడింది. మరోవైపు అంతర్జాతీయ బలహీన పరిణామాలతో సోమవారం ప్రారంభం నుంచే సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ పరిణామాల మధ్య బిఎస్ఇ సెన్సెక్స్ తుదకు 540 పాయింట్లు లేదా 1.3 శాతం కోల్పోయి 40,145.50కు పడిపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 163 పాయింట్లు లేదా 1.36 శాతం కోల్పోయి 11,768 వద్ద ముగిసింది. బిఎస్ఇలో మిడ్ క్యాప్ 1.77 శాతం, స్మాల్ క్యాప్ 0.88 శాతం చొప్పున విలువ కోల్పోయాయి. ఎన్ఎస్ఇలో అన్ని రంగాల సూచీలు నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో రిలయన్స్ ఇండిస్టీస్ 4 శాతం మేర విలువ కోల్పోవడం మదుపర్ల విశ్వాసాన్ని మరింత దెబ్బతీశాయి.