Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా: బీహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సోమవారం నాటితో తెరపడింది. 28న ఆరు జిల్లాల పరిధిలో జరగనున్న తొలిదశ పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడతలో భాగంగా 71 స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి మొత్తం 1,066 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. వీరిలో 114 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికలు జరగనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా అధికార, పత్రిపక్ష పార్టీలు వాడీవేడిగా ప్రచారాన్ని హోరెత్తించాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో బీహర్ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా సాగిన తొలి ప్రచారంలో అన్ని పార్టీల తరపున అగ్రనేతలు పాల్గొన్నారు. ఎన్డిఎ కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోడీ మూడు ప్రచార ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇంకా మహాఘట్బందన్ కూటమి తరపున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఎన్డీఏ నేతలు ప్రజలు కోరగా, ఈ సారి ఎన్నికల్లో మోసపూరిత ఎన్డీఏ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా తమకు మద్దతు ఇవ్వాలని మహాఘట్బందన్ కూటమికి చెందిన నేతలు పిలుపునిచ్చారు.