Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సిఐటియు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేంద్ర కుమార్(75) మృతి పట్ల ఆ సంఘం సోమవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేసింది. నరేంద్ర కుమార్ బిజ్నోర్ జిల్లాలోని సోహార్ చక్కెర మిల్లులో ఒక కార్మికుడిగా పనిచేస్తున్నారు. పరిశ్రమలోని కార్మికులను ఐక్యం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలను ముందుండి నడిపించారు. నరేంద్ర కుమార్ సిఐటియు అనుబంధ సంఘమైన సుగర్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉండడంతో పాటు సిఐటియు రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మృతి సుగర్ మిల్లుల కార్మిక పోరాటానికి, తమ రాష్ట్ర శాఖకు తీరని లోటని సిఐటియు తన ప్రకటనలో పేర్కొంది. నరేంద్రకుమార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సిఐటియు ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించింది.