Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్కు పాజిటివ్
- తమిళనాడు వ్యవసాయ మంత్రి ఆరోగ్యం విషమం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 45,149 మంది కరోనా బారినపడ్డారు. ఇదే సమయంలో వైరస్తో పోరాడుతూ 480 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 79,09,960కి చేరింది. మరణాల సంఖ్య మొత్తం 1,19,014కు పెరిగింది. ప్రస్తుతం 6,53,717 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 71,37,229 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ దేశంలో మొత్తం 10,34,62,778 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ ఔషధ పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్) వెల్లడించింది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాసు కరోనా బారినపడ్డారు. కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్గా వచ్చిందని ఆయన తెలిపారు. తనకు ఎలాంటి వైరస్ లక్షణాల్లేవని తెలిపారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందనీ, వైద్యుల సలహా మేరకు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరినట్టు ఆయన వెల్లడించారు. ఈ నెల 13న కరోనా బారినపడిన తమిళనాడు వ్యవసాయ మంత్రి ఆర్.దొరైకన్ను ఆరోగ్యం విషమించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కె.పళనిస్వామి, మంత్రులు విజరు కుమార్, విజరు భాస్కర్లు.. దొరైకన్ను చికిత్స పొందుతున్న ఆస్పత్రిని సందర్శించారు.
భువనేశ్వర్ లో కోవాగ్జిన్ తుదిదశ పరీక్షలు
భారత్ బయోటెక్, ఐసీఎంఆర్లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ తుదిదశ పరీక్షలు ఒడిశాలోని భువనేశ్వర్లో జరగనున్నాయి. వీటిలో వాలంటీర్లుగా పాల్గొనే ఆసక్తి ఉన్నవారి నుంచి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతున్నాయి.