Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జార్ఖండ్ లో 1999 నాటి బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి దిలిప్రేకు సీబీఐ ప్రత్యేక కోర్టు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. దిలిప్తో ఈ నేరంలో పాలుపంచుకున్న మరో ఇద్దరికీ కూడా ఇదే శిక్ష ఖరారు చేసింది. ఈ ముగ్గురిని దోషులుగా పేర్కొంటూ ఇటీవల సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. వీరికి సోమవారం శిక్ష ఖరారు చేసిన ప్రత్యేక జడ్జి భరత్ ప్రసార్.. దోషులకు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించారు. కాగా, ఈ తీర్పును సవాలుచేస్తూ..అదేవిధంగా బెయిల్ నిమిత్తం కోర్టును ఆశ్రయించాలని దిలిప్ రే న్యాయవాది భావిస్తున్నారు. అటల్ బీహారీ వాజ్పేయి ప్రభుత్వంలో బొగ్గు గనుల సహాయక మంత్రిగా వ్యవహరించిన దిలిప్ రే..బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై నేరపూరిత కుట్రతో సహా వివిధ సెక్షన్ల కింద ఇదే కోర్టు జీవిత ఖైదును విధించింది.