Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్యూచర్ గ్రూప్ తో ఒప్పందం నిలుపుదల
న్యూఢిల్లీ : బహుళజాతి కార్పొరేట్ కంపెనీలు రిలయన్స్ ఇండిస్టీస్, అమెజాన్ మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యింది. బిగ్బజార్ ఇతర రిటైల్ చెయిన్ కలిగిన ఫ్యూచర్ గ్రూపు రిటైల్ కొనుగోలు అంశంలో రిలయన్స్కు సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్(ఎస్ఐఏసీ)లో ఎదురు దెబ్బ తగిలింది. ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్వీఎల్)కు రూ.24,713 కోట్లకు విక్రయించిన విషయం తెలిసిందే. దీంతో ఫ్యూచర్ గ్రూప్ ఇంతక్రితం అమెజాన్తో కుదుర్చుకున్న ఒప్పందానికి విరుద్ధమైనదంటూ ఆ కంపెనీ ఎస్ఐఏసీని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ఎస్ఐఏసీ ఈ కేసులో రిలయన్స్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రస్తుతానికి నిలిపివేయవలసిందిగా ఫ్యూచర్ గ్రూప్ను ఆదేశించింది. దీంతో అమెజాన్కు ఊరట లభించింది.
కోర్టు ఆదేశాలతో సోమవారం బీఎస్ఈలో రిలయన్స్ షేర్ ఏకంగా 3.97 శాతం లేదా రూ.83.85 పతనమై రూ.2,028.70కు పడిపో యింది. రూ.2,101 వద్ద ప్రారంభమైన సూచీ ఓ దశలో రూ.2,018 కనిష్ట స్థాయిని తాకింది. ప్యూచర్ సప్లయి చెయిన్ సొల్యూషన్స్ షేర్ 4.95 శాతం క్షీణించి రూ.91.20 వద్ద ముగిసింది. ఫ్యూచర్ రిటైల్కు చెందిన వ్యాపారాలను భారతీయ చట్టాల ప్రకారమే స్వాధీనం చేసుకుంటున్నట్టు ఆర్ఆర్వీఎల్ పేర్కొనగా.. ఎస్ఐఏసీ మధ్యంతర ఆదేశాలపౖౖ న్యాయ సలహాలను తీసుకోనున్నట్టు కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ పేర్కొంది. ఫ్యూచర్ కూపన్స్ ప్రయివేట్ లిమిటెడలో అమెజాన్కు 49 శాతం వాటా ఉంది. 2019లో దాదాపు రూ.1430 కోట్లతో దీనిని కొనుగోలు చేసింది. కాగా ప్యూచర్ గ్రూపులో భాగమైన ఈ రిటైల్ సంస్థలోని బియానీ తమ మిగతా వాటాను కూడా రిలయన్స్కు విక్రయించింది. ఇది అమెజాన్ అధిపతి జెప్ బెజోస్కు మింగుడు పడలేదు. ఇది తమతో ప్యూచర్ గ్రూపు చేసుకున్న తొలి ఒప్పందానికి విరుద్దమని కోర్టును ఆశ్రయించగా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.