Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కాశ్మీర్ టైమ్స్ సంపాదకురాలు అనురాధా భాసిన్పై జమ్మూలో ఇటీవల జరిగిన దాడులను ఐద్వా తీవ్రంగా ఖండించింది. జమ్మూ కాశ్మీర్ ప్రజల హక్కులపై భారత ప్రభుత్వం జరిపిన దాడులను తీవ్రంగా విమర్శించిన నేపథ్యంలో ఆమెపై ఈ దాడులు జరిగాయి. గతేడాది ఆగస్టులో కాశ్మీర్లో ఇంటర్నెట్తో పాటు ఇతర సమాచార వ్యవస్థను పూర్తిగా నిషేదిస్తూ కేంద్రం తీసుకున్న చర్యలపై కూడా ఆమె సుప్రీం కోర్టుకు వెళ్ళారు. దీంతో కొంత కాలంగా ఆమెపై కక్ష సాధింపు చర్యలు చోటుచేసుకుంటున్నాచి. ప్రభుత్వం కేటాయించిన నివాసం నుండి ఆమెను బలవంతంగా ఖాళీ చేయించారు. ఆవార్తాపత్రిక కార్యాలయాన్ని మూసివేయించారు. అయినా తాను వాస్తవాన్నే మాట్లాడతానని ఆమె ప్రకటించారు. ఏడాది మొత్తం మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారు నవరాత్రుల్లో మాత్రం ఆరాధించడంలో గల వంచన, కపటనాటకాన్ని ఎత్తిచూపేలా కార్టూన్ను ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో హిందువుల మనోభా వాలు దెబ్బతీశారంటూ ఆమెపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఐద్వా అనురాధా బాసిన్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భద్రత కల్పించా లనీ, న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.