Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ-నితీష్ కూటమికి ఎదురుగాలి
న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశలో భాగంగా నేడు 71 స్థానాల్లో పోలింగ్ జరగనున్నది. ఆయా రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 1066 మంది అభ్యర్థులు 71 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి నిలబడ్డారు. నవంబర్ 3, 7 తేదీల్లో రెండవ, మూడవ దశ పోలింగ్ జరగనుంది. నవం బర్ 10న ఫలితాలు వెలువడనున్నాయి. బీజేపీ, జేడీయూ సంకీర్ణ కూటమికి ఈసారి పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా కేంద్రంలో మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న ట్టు పలు సర్వేలు పేర్కొన్నాయి. మరోవైపు 2005 నుంచి ఇప్పటి వరకు నితీష్ కుమార్ సీఎంగా 15 ఏండ్లపాటు సాగిన పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నితీష్కుమార్కు ఈసారి ఓటమి ఖాయమని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆరేజేడీ, మూడు వామపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ కూటమిగా పోటీ చేస్తోంది. మొదటి దశ ఎన్నికల్లోని 10అసెంబ్లీ స్థానాల్లో జేడీయూ అభ్యర్థులకు పోటీగా రామ్విలాస్ పాశ్వాన్కు చెందిన 'లోక్జన్శక్తి పార్టీ' (ఎల్జేపీ) అభ్యర్థులు నిలబడటం కీలకంగా మారుతుందని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు. డినారా, సూర్యగా రహ, అమర్పూర్ జిల్లాల్లో ఎల్జేపీకి బలమైన ఓటుబ్యాంకుఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే లందరికీ ఆర్జేడీ టికెట్లు ఇచ్చింది.