Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకప్పుడు 12వేలకు పైగా సహకార సంఘాలు.. ఇప్పుడు కొన్ని వందలు మాత్రమే
- తమిళనాడులో ప్రయివేటు డైరీల ఇష్టారాజ్యం
- నూతన వ్యవసాయ చట్టాలు ఎంత ప్రమాదమో ఈ ఉదాహరణ చాలు : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయంగా, సామాజి కంగా పలువురు ప్రముఖులు, ఆయా రంగాల నిపుణులు ఈ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. వీటితో దేశ రైతాంగం, ముఖ్యంగా గ్రామీణ పేదలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తు న్నారు. వ్యవసాయ రంగాన్ని, మార్కెటింగ్ను ప్రయివేటు శక్తులకు అప్పజెబితే ఎలాంటి దుష్ఫరి ణామాలు ఉంటాయో ఈ దేశంలో అనేక అనుభవా లున్నాయి. బడా వ్యాపారుల ఇష్టారాజ్యం ఎలా ఉంటుందో తమిళనాడు పాల సహకార సంఘాల చరిత్ర తెలియజేస్తోంది. ఒకప్పుడు 12వేలకుపైగా పాలసహకార సంఘాలతో డైరీ పరిశ్రమ తమిళ నాడులో కలకలలాడుతూ ఉండేది. పేద రైతులు, భూమి లేని పేదలు, మహిళలు..సహకార సంఘాల సేవలతో లబ్దిపొందారు. అయితే ఇదంతా కూడా 1990లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కకావికలమైంది. ఆర్థిక సరళీకృత విధానాల్లో భాగంగా, తమిళనాడులో ప్రయివేటు డైరీల ప్రవేశానికి అనుమతిచ్చారు.
చెప్పిన రేటుకే అమ్మాలి.. కొనాలి
ఇవి మొదలైన రెండు మూడేండ్లలో 4వేలకుపైగా పాల సహకార సంఘాలు మూతపడ్డాయి. చురుకు గా నడిచే వాటి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. మొత్తంగా ఈ వ్యవహారంలో ప్రయివేటు డైరీలు పెద్ద ఎత్తున లాభపడ్డాయి. ఇప్పుడు తమిళనాడులో ప్రయివేటు డైరీలు చెప్పిన ధరకు రైతులు పాలను అమ్ముకోవాలి. వారు నిర్ణయించిన ధరకు వినియో గదారులు పాల ప్యాకెట్లు కొనుగోలు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల 4వేలకుపైగా పాల సహకార సంఘాలు మూతపడ్డాయి. 12,585 పాల సహకార సంఘాలు, 2075 మహిళా పాల సహకార సంఘాలున్న తమిళనాడులో నేడు ప్రయివేటు డైరీలదే ఇష్టారాజ్యం. పాల ఉత్పత్తులను అందరికీ అందుబాటులోకి తీసుకురావటమనే పేరుతో, డైరీ పరిశ్రమను వ్యవస్థీకృతం చేయటమనే పేరుతో ఆనాడు కేంద్రం తన చర్యల్ని సమర్థించుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయివేటు డైరీలు బలపడ్డాయి. పాల సహకార సంఘాలు నిర్వీర్యమయ్యాయి. ప్రయివేటు డైరీలు నిర్ణయించిన ధరకు రైతులు పాలను అమ్ముకునే పరిస్థితి ఇప్పుడా రాష్ట్రంలో నెలకొంది.
ప్రయివేటుకు బాటలు ఇలా..
దేశంలో పాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు 10వ స్థానంలో ఉంది. 1990 వరకూ...చిన్న, సన్నకారు రైతులు, చిన్న చిన్న కమతాలున్న రైతులు, వారి కుటుంబాలు పాల ఉత్పత్తిలో భాగస్వాములుగా ఉన్నారు. రైతు కూలీలు, భూమిలేని పేదలు, లక్షలాది కుటుంబాల్లోని మహిళలు...ఇలా ఎంతోమంది పశువుల పెంపకం, పాల ఉత్పత్తితో ఎంతోకొంత ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. 1958లో తమిళనాడు డైరీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏర్పాటైంది. దీని సారథ్యంలో పాల సహకార సంఘాలు గ్రామగ్రామానా వెలిశాయి. గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో సహకార రైతు సంఘాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర స్థాయిలో 1081లో పాల ఉత్పత్తిదారుల ఫెడరేషన్ స్థాపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాల సేకరణ, నిల్వ, శుద్ధి, ప్రాసెసింగ్, ప్యాకింగ్ వంటివి, వినియోగదారుల ఇంటిముంగిటకు పాల ప్యాకెట్లను చేర్చడం వంటివన్నీ ఫెడరేషన్ చూసుకునేది. ఇదంతా కార్యరూపం దాల్చడానికి ఎంతో మంది రైతులు దశాబ్దాలుగా ఉద్యమించారు. మేధా వులు, రాజకీయ, సామాజిక ప్రమఖులు రైతు పోరాటాలకు మద్దతు పలికారు. అయితే కేంద్రం 1990ల్లో ఎంచుకున్న ఆర్థిక సరళీకృత విధా నాలతో సహకార సంఘాల వ్యవస్థకు గట్టి ఎదురుబెబ్బ తగిలింది. ప్రయివేటు డైరీలకు తలుపులు బార్లా తెరిచారు. సహకార సంఘాల కన్నా ఎక్కువ ధరలో పాలను సేకరించి, తక్కువ ధరలో వినియోగ దారులకు అవి పంపిణీ చేసేవి. డైరీ పరిశ్రమలో వాటాను పెంచుకోవ డానికి కొద్దికాలంపాటు ప్రయివేటు డైరీలు ఈ ఎత్తుగడను అమలు జేశాయి. సహకార సంఘాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని తేలిపో యిన తర్వాత, వాటి అసలు రంగం బయటపడింది. పాల ధరలను క్రమంగా పెంచుతూ వినియోగదారులపై భారాన్ని మోపుతున్నాయి.