Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే మైనస్లోకి పతనం : ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ సున్నా శాతం లేదా ఏకంగా మైనస్లోకి పడిపోయే అవకాశాలున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా అన్నారు. గడిచిన ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ మైనస్ 23.9 శాతం క్షీణించడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో కొంత పురోగతి కనబడుతుందన్నారు. మంగళవారం ఇండియా ఎనర్జీ ఫోరమ్ ఆఫ్ సెరవీక్లో మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటానికి మార్చి 25న ప్రకటించిన లాక్డౌన్ జీడీపీనీ ప్రభావితం చేసిందన్నారు. అనంతరం నిబంధనల సడలింపులతో సూక్ష్మ ఆర్థిక గణంకాలు పుంజుకుంటున్నాయన్నారు. ప్రస్తుత పండుగ సీజన్ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు మద్దతునిస్తుందని.. దీంతో మూడు లేదా నాలుగో త్రైమాసికంలో సానుకూల వృద్థి రేటు నమోదయ్యే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థూలంగా 2021 మార్చి 31తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీి ప్రతికూల వృద్థి లేదా సున్నా శాతాన్ని నమోదు చేసే అవకాశాలున్నాయ న్నారు. ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాల్లో ప్రజల వ్యయం పెరిగేలా ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి తెలిపారు.