Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎగుమతుల్లో 11.9 శాతం వృద్ధి
- వీసెజ్ డెవలప్మెంట్ కమిషనర్ రామ్మోహన్రెడ్డి
విశాఖపట్నం : వీసెజ్ పరిధిలోని తెలంగాణకు చెందిన సెజ్ యూనిట్ అప్రూవల్ కమిటీ పలు ప్రాతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీసెజ్ డెవలప్మెంట్ కమిషనర్ ఎ.రామ్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆన్లైన్ సమావేశంలో కొత్త యూనిట్ల ఏర్పాటుకు అనుమతులిచ్చింది. తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలో రూ.121.94 కోట్ల విలువైన ఎగుమతుల సామర్ధ్యం కల్గిన ఆనలోగ్ డివైస్ ఇండియా కంపెనీ రూ.186.25 కోట్ల ఎగుమతులతో కాఫీ తదితర పరిశ్రమలకు ప్యాకింగ్ క్యాన్స్ తయారుచేసే ఎజె ప్యాకింగ్ కంపెనీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పనిచేస్తున్న పరిశ్రమల విస్తరణకు అనుమతులు మంజూరుచేసింది. ఓఎస్ఐ సిస్టమ్ కంపెనీ కొత్తగా సెన్సర్ కేబుల్స్, ఐటి ఆధారిత సేవలు అందించనుంది. శ్యాండ్యూ ప్రొపర్టీస్లోని ఎన్సిఆర్ కార్పొరేషన్ 29,823 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా కార్యాకలాపాలు ప్రారంభించనుంది. అసెంట్ బిజినెస్ సెల్యూషన్ 4,582 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని సెప్టెంబరు నాటికి వీసెజ్ ఎగుమతులు రూ.54,024 కోట్లకు చేరి 11.9 శాతం వృద్ధి సాధించినట్లు డిసి రామ్మోహన్రెడ్డి తెలిపారు. కోవిడ్, ఆర్థిక మాంధ్యంలో కూడా ఎగుమతుల్లో వృద్ధి శాతం ఆశాజనకంగా వుందన్నారు. ఈ ఏడాది లక్ష కోట్ల ఎగుమతుల లక్ష్యాన్ని అధిగమించగలమన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ష