Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొణె మేనేజర్ కరిష్మా ప్రకాశ్ ఇంట్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే 1.7 గ్రాముల చారాస్, రెండు సీసాల గంజాయి నూనే (సీబీడీ) పట్టుబడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పరారీలో ఉన్న కరిష్మా ప్రకాశ్ను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. దాడుల సమయంలో వెర్సోవాలోని తన నివాసంలో కరిష్మా ప్రకాశ్ లేరనీ, ఆమె బంధువుల సమక్షంలో ఈ సోదారలు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలోనే బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. దీని కూపిలాగే క్రమంలోనే ఎన్సీబీ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన సందర్భంగా కరిష్మా ప్రకాశ్ పేరు గురించిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉన్నారో సమాచారం తెలియలేదనీ, ఈ క్రమంలోనే నోటీసులను ఆమె ఇంటికి అతికించినట్టు తెలిపారు. కాగా, సుశాంత్ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రకాశ్ను ఎన్సీబీ ప్రశ్నించింది. బాలీవుడు డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన వాట్సాప్ చాట్ వెలుగుచూడటంతో.. దీపికాను సైతం ఎన్సీబీ అధికారులు ఇదివరకే ప్రశ్నించారు.