Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో 80 లక్షలకు చేరువైన కరోనా పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) బారినపడుతున్న వారి సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో దేశంలో కరోనా మహమ్మారి బలి తీసుకున్న వారి సంఖ్య 1.20 లక్షలు దాటింది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 43,893 మంది వైరస్ బారినపడ్డారు. ఇదే సమయంలో వైరస్తో పోరాడుతూ 508 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,20,010కు పెరిగింది. అలాగే, కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 79,90,322కు చేరింది. ప్రస్తుతం 6,10,803 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 58,439 మంది కోలుకోవడంతో వారి సంఖ్య మొత్తం 72,59,509కి చేరింది. దీంతో కరోనా రోగుల రికవరీ రేటు 90.6 శాతానికి, మరణాల రేటు 1.5 శాతానికి చేరింది. కాగా, దేశంలో ఇప్పటివరకూ 10,54,87,680 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 10,66,786 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది.
అయితే, కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ, ఢిల్లీ, బెంగాల్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు టాప్-10లో ఉన్నాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 16.54 లక్షల పాజిటివ్ కేసులు, 43 వేలకు పైగా మరణాలు చోటుచేసుకున్నాయి.