Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత నెల 21 నుంచి ప్రతిరోజూ 50 వేల కన్నా తక్కువ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం 35,551 పాజిటివ్ కేసులు నమోదవడంతో, మొత్తం కేసుల సంఖ్య 95,34,964కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 95 లక్షల మార్కును దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,22,943గా ఉంది. 89,73,373 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 526 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,38,648కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4.44 శాతం తగ్గిందని, రివకరీ రేటు 94.11 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.